శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (13:09 IST)

కరోనా బారిన పడిన నితిన్ గడ్కరీ.. స్వల్ప లక్షణాలతో..?

ఇటీవలి కాలంలో కరోనా బారిన పడుతున్న మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కరోనా బారిన పడిన నేపథ్యంలో తాజాగా కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి.
 
"నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. అన్ని ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ నాకు నేనుగా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.." అంటూ గడ్కరీ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.