శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (21:44 IST)

నీకు చేతకాదు, అందుకే నీ భార్య మాతో ఎఫైర్ అన్నందుకు కరెంట్ తీగలు పట్టుకున్నాడు

అక్రమ సంబంధాలు ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీయడమో, తీసుకోవడమో చేస్తున్నారు. ఇలా చాలామంది జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. వివాహం చేసుకున్న భర్తకు లైంగిక సుఖంపై ఆసక్తి లేకపోవడంతో భార్య ఏకంగా ముగ్గురు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్యకు నచ్చజెప్పి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. 
 
రాజస్థాన్ లోని రాజ్ కోట్‌లో నివాసముంటున్న గాంధీరామ్ ప్రహ్లాద్, మహేశ్వరిలకు ఆరు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరూ కూలి పనిచేసుకుని జీవనం సాగించేవారు. గాంధీరామ్ ప్రహ్లాద్‌కు దాంపత్య జీవితంపై ఆసక్తి లేదు. ఈ విషయంలో భర్తపై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చింది భార్య. అయితే తనకు ఆసక్తి లేదని.. మళ్ళీమళ్ళీ అడగవద్దని భార్యను పక్కకు పెట్టేవాడు ప్రహ్లాద్.
 
దీంతో భార్య విరహం తట్టుకోలేకపోయింది. తనతో పాటు కూలి పనిచేసే నరసింహ, రవిశంకర్, మహేష్‌లతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ తంతు కాస్త నెలరోజుల నుంచి సాగుతోంది. ఇంటికే ప్రియుళ్ళను పిలిపించుకుని ఆ పని కానిచ్చేది మహేశ్వరి. భర్తకు విషయం తెలిసింది.
 
భార్యను మందలించాడు. అలా అలా గ్రామంలో అందరికీ తెలిసింది. పరువు పోతుందని భార్యను ప్రాదేయపడ్డాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో సోమవారం సాయంత్రం కూలి పని ముగించుకుని ఇంటికి వస్తూ మార్గమధ్యంలో విద్యుత్ వైర్లను పట్టుకున్నాడు ప్రహ్లాద్. దీంతో అక్కడికక్కడే కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మహేశ్వరితో పాటు ముగ్గురు నిందితులును అదుపులోకి తీసుకున్నారు.