మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:33 IST)

రూప వర్సెస్ రోహిణి సింధూరి.. వీరిద్దరి సంగతేంటి?

woman
ఐపీఎస్ అధికారిణి రూప ప్రస్తుతం కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి కర్ణాటకలోని ముజరాయి, దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఈమె నెట్టింట పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమైంది. 
 
కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య తారాస్థాయికి చేరింది. ఈ వివాదం కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికరుల మధ్య వివాదానికి దారితీసింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న వారిలో ఐపీఎస్ అధికారిణి రూప ఒకరు కాగా, మరొకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి. 
 
రోహిణి సింధూరిపై ఫిర్యాదులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రోహిణితో పాటు ఆమెకు సహకరించిన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
రోహిణి సింధూరికి లేఖలు రాయడం వంటి అనేక సందర్భాల్లో తాను, తన భర్త ఐఏఎస్ అధికారి మౌనీష్ మౌద్గిల్ సహాయం చేశామని రూప పేర్కొన్నారు. కానీ, ఈ రోజుల్లో రోహిణి ప్రవర్తన మారిందని, రోహిణి తన హద్దులు దాటిందని రూప ఆరోపించారు.
 
రూపా చేసిన ఆరోపణలపై స్పందించిన రోహిణి సింధూరి సర్వీస్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు రూపపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుతో అప్పిలేట్ అథారిటీ తలుపులు తట్టుతామని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.   ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని రోహిణి సింధూరి రూపను హెచ్చరించారు.