శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (20:13 IST)

నాగపట్టణంలో ఘోరం.. గుడిలోకి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్

నిర్భయ, దిశ లాంటి చట్టాలొచ్చినా.. మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా 40 ఏళ్ల మహిళను గుడిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు మృగాళ్లు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని నాగపట్టణంలో చోటుచేసుకుంది.

గురువారం రాత్రి సోదరి ఇంటికి ఒంటరిగా వెళ్తున్న మహిళను కత్తితో బెదిరించి గుడిలోకి లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె దగ్గరున్న నగదును దోచుకుని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి పారిపోయారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
గుడిలో స్పృహతప్పి పడిపోయి ఉన్న మహిళను స్థానికులు అస్పత్రికి తరలించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు మద్యం సేవించి ఉన్నట్లు బాధితురాలు చెప్పిందని వెల్లడించారు. ఆమె వితంతువు అని, భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తోందని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేసే దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.