మంగళవారం, 19 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 11 జూన్ 2019 (18:12 IST)

దొంగ దొంగ... అంటూ విజయమాల్యాను తరిమిన జనం..!

భారతదేశంలో బ్యాంకులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నారు విజయమాల్యా. అది కూడా విదేశాల్లో విజయమాల్యా ఎక్కువగా ఉన్నారు. అప్పులు కట్టాల్సిన బ్యాంకు సిబ్బంది విజయమాల్యాను ప్రశ్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విజయమాల్యా డబ్బులు ఇస్తారనుకుని ఎదురుచూశారు. కానీ విజయమాల్యా ఎప్పుడూ బయటి దేశాల్లోనే తప్పించుకు తిరుగుతున్నారు.
 
అయితే నిన్న లండన్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ చూస్తూ కనిపించాడు విజయమాల్యా. మ్యాచ్ అయ్యేంతవరకు ప్రవాస భారతీయులు సహనంగా ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే దొంగ... దొంగ.... అంటూ మాల్యాను చూపిస్తూ గట్టిగా నినాదాలు చేశారు.
 
దొంగ మాల్యా.. మా డబ్బులు మాకు ఇచ్చేయ్. బ్యాంకులకు సమాధానం చెప్పు. నువ్వు చేసేది ఏమైనా బాగుందా అంటూ నినాదాలు చేశారు ప్రవాస భారతీయులు. విజయమాల్యాను నిలదీసిన వారిలో ఎక్కువ మంది గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారు.