గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2017 (21:58 IST)

న్యూయార్క్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలుగు విద్యార్థిని

ఎన్నో ఆశలతో విదేశాలకు ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థిని కొల్లూరు శ్రీలేఖ న్యూయార్క్ నగరంలోని జాన్సన్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఐతే వెనువెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అ

ఎన్నో ఆశలతో విదేశాలకు ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థిని కొల్లూరు శ్రీలేఖ న్యూయార్క్ నగరంలోని జాన్సన్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఐతే వెనువెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె బంధువు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీలేఖ బస్సు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెకు వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసి వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. ఆమెకు అవుతున్న వైద్య ఖర్చులు పెనుభారంగా పరిణమించడంతో శ్రీలేఖ బంధువు గిరిధర్ ఆన్‌లైన్‌లో క్రౌడ్ ఫండింగ్ అనే క్యాంపెయిన్‌ను చేశారు. 
 
శ్రీలేఖ తల్లిదండ్రులు పేదవారనీ, కుమార్తె మంచి మేథస్సు కల విద్యార్థిని కావడంతో బ్యాంకు రుణం తీసుకుని ఆమెను ఉన్నత చదువుల కోసం పంపారనీ, కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనితో ఆమె వైద్య సాయం కోసం దాతలు కేవలం 5 గంటల్లోనే 59, 511 డాలర్లను విరాళంగా ఇచ్చారు. కాగా ఆమె వైద్యానికి కనీసం లక్ష డాలర్ల వరకూ ఖర్చయ్యే అవకాశం వున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు తమ కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురికావడం పట్ల ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరిది ఖమ్మం జిల్లా మధిర.