మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (19:25 IST)

12 రాశుల వారు దర్శించుకోవాల్సిన శివాలయాలు ఏంటో తెలుసా? (video)

12 రాశులకు చెందిన జాతకులు.. రాశులకు అనుగుణంగా ఏ శివాలయాన్ని దర్శించుకోవాలో తెలుసుకోవాలనుందా..? ఐతే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే. మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి, అలాగే సోమవారాల్లో శివుడిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.


అలాగే 12 రాశుల వారు రాశికి అనుగుణమైన శైవక్షేత్రాన్ని సందర్శించడం ద్వారా ఈతిబాధలు వుండవు. ఆయుర్దాయం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఇందులో భాగంగా మేషరాశి వారు కొండపై వెలసిన శివాలయాలను దర్శించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే వృషభ రాశి జాతకులు.. తిరువారూరు శివాలయాన్ని దర్శించుకోవడం మంచిది. 
మిథునరాశి జాతకులు.. చిదంబరం, శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకోవడం శుభప్రదం.
కర్కాటకం.. తిరుక్కడయూర్, వేలూరులోని జలకండేశ్వర స్వామిని దర్శించుకుని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
సింహ రాశి.. చిదంబరం, అరుణాచల క్షేత్రం 
 
కన్యారాశి వారు.. కాంచీపురం ఏకాంబరనాధ స్వామిని, మదురై మీనాక్షి చొక్కనాథ స్వామిని దర్శించుకోవటం అనుకున్న కార్యాలను దిగ్విజయం చేస్తుంది. 
తులారాశి.. చిదంబరం, శ్రీ కాళహస్తి, మదురై ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. 
వృశ్చిక రాశి జాతకులు.. అరుణాచల స్వామిని దర్శించటం ఉత్తమం. 
మకర రాశి.. కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి 
కుంభం.. చిదంబరం, శ్రీ కాళహస్తి, 
 
మీనం.. వేదారణ్యం, జలకండేశ్వర స్వామిలను దర్శించుకుంటే ఆదాయాభివృద్ధి చేకూరుతుంది. అలాగే ఈ ఆలయాలను సందర్శించుకోవడంతో పాటు పూజా వస్తువులను కొనివ్వడం, చెరకు రసంతో అభిషేకం చేయించడం, పంచాక్షర మంత్రంతో జపించడం వంటివి చేస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు.. మానసిక ఉత్సాహం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.