Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ పూర్ణిమ.. భద్ర సమయంలో రాఖీ కట్టకండి..

Written By సెల్వి
Updated: మంగళవారం, 9 ఆగస్టు 2022 (19:11 IST)
పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ అంటారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11, గురువారం. ఈ రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రావణపండుగను జరుపుకుంటారు. పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 07:05 వరకు చెల్లుతుంది. 
 
ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి శ్రావణ పూర్ణిమ ఆగష్టు 11న వస్తుంది. ఈ ఏడాది రక్షాబంధన్ కూడా ఆగస్టు 11న జరుపుకోనున్నారు. శ్రావణ పూర్ణిమ నాడు సాయంత్రం 08:51 భద్ర సమయం ముగుస్తుంది. ఈ సమయంలో మీరు రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు. ఆ ఘడియలు ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. 
 
రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశుడికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తరువాత లంక చెడు దశ ప్రారంభమైంది. రావణుడికి దురదృష్టం మొదలైందని చెబుతారు.
 
అందుకే సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టండి. అంటే 08:51 రాత్రి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 12 ఉదయం 07: 05 వరకు కట్టండి. కొన్ని నిబంధల మినహా సాయంత్రం 06:08 నుండి 08:00 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డైరెక్ట్ మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్ ఎల్బీ నగర్‌లో ఏర్పాటు

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ కేసు: తొలుత ప్రియురాలు మాధురి సూసైడ్ ఎటెంప్ట్, ఇప్పుడు అదే దారిలో భార్య

యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ

శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

తర్వాతి కథనం
Show comments