సంబంధిత వార్తలు
- ఫిబ్రవరి 16న రథసప్తమి.. పూజ ఎలా చేయాలి..
- సర్ఫరాజ్ అరుదైన రికార్డ్.. రోహిత్ శర్మ అర్థ సెంచరీ.. కష్టాల్లో భారత్
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ?
- స్పీడ్ డేట్: ప్రేమికుల రోజుని వ్యతిరేకించే వారికి నిరసనగా మొదలైన ఈ కొత్త ట్రెండ్ ఏంటి?
- పాకిస్థాన్లో కీలక పరిణామం : ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్!!
రథసప్తమి.. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు.. ధనానికి లోటు లేకుండా?
మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. ఈ లోకానికి వెలుగునిచ్చే తేజోమూర్తి అయిన సూర్యభగవానుడు మాఘ సప్తమి నాడు జన్మించటం వలన ఈ రోజును సూర్య జయంతిగాను జరుపుకుంటారు. రథసప్తమి రోజున చేసే స్నానం, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు మిగతా సమయంలో చేసే వాటికంటే అధికఫలాన్ని ఇస్తాయని పురాణాలూ చెపుతున్నాయి.
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు. సూర్యునికి ఈ రోజున నేతితో దీపం వెలిగించడం.. ఎర్రటి పువ్వులను సమర్పించడం చేయాలి.
