ఆదివారం నువ్వుల నూనెతో తలంటు స్నానం వద్దే వద్దు..

Updated: గురువారం, 13 జూన్ 2019 (18:35 IST)
సాధారణంగా మనల్లో చాలామంది ఆదివారం సెలవు కావడంతో తలంటు స్నానం చేస్తుంటారు. అయితే అలా చేయకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఆదివారం పూట నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయడం కూడదు.


శనివారం పూటే నువ్వుల నూనెను తలకు, శరీరానికి పట్టించి.. అభ్యంగన స్నానం చేయడం ఉత్తమం. ఆదివారం గాడిద కూడా నువ్వుల తోట వైపు వెళ్లదని పెద్దలంటారు. అందుచేత తలంటు స్నానానికి ఆదివారం మంచిది కాదు. 
 
ఇక పురుషులు బుధవారం, శనివారం పూట తలంటు స్నానం చేయడం, అభ్యంగన స్నానం చేయడం మంచిది. అలాగే మహిళలు మంగళ, శుక్రవారాల్లో తలంటు స్నానం చేయడం ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. ముఖ్యంగా శుక్రవారం తలంటు స్నానం చేసే మహిళలకు ఆయురారోగ్యాలు పెంపొందుతాయి. 
 
ఇకపోతే.. ఉదయం 8 గంటల కంటే ముందు సాయంత్రం ఐదు గంటలకు తర్వాత తలంటు స్నానం చేయకూడదు. శరీరానికి నువ్వులనూనె బాగా పట్టించడం ద్వారా చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. 
 
పొడిబారిన చర్మానికి తేమ లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత సక్రమంగా లేని పక్షంలో అలసట ఆవహిస్తుంది. నీరసం తప్పదు. అందుకే నువ్వుల నూనెతో వారానికి ఓసారైనా తలంటు స్నానం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఈ వేసవిలో దుబాయ్‌లో పిల్లలకు వినోదాన్ని అందించండి

రీల్స్ తీసే కెమెరామెన్‌‍ను పెళ్లాడిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు... ఎవరా అదృష్టవంతుడు?

తోటి ఉద్యోగులు పట్టించుకోలేదు.. ఆ స్ట్రీట్ డాగ్ విశ్వాసం చూపింది (వీడియో)

ప్రధాని మోడీ ట్వీట్‌తో ఒరిగేదేమీలేదు : ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే : సీజేపీ

విద్యార్థుల ఆందోళనపై బాలీవుడ్ నటుల మౌనం : శశిథరూర్ విమర్శలు

అన్నీ చూడండి

TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌

తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments