Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ శరీరంతో మీకేం పని... ఎక్కువ ఆలోచించవద్దు... స్వామి వివేకానంద

శరీరాన్ని గురించి మనమెంత తక్కువుగా ఆలోచిస్తే అంత మంచిది అని చెప్పారు స్వామి వివేకానంద. ఎందుకంటే మనలను క్రిందకి దిగలాగేది ఈ శరీరమే అన్నారాయన. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... సంగత్వం, దేహాత్మభ్రాంతి- ఇవే మన దుఃఖాలకు కారణం. రహస్యం ఏమిటో తెలుసా, నేనీ దేహాన్ని

Written By chj
Updated: సోమవారం, 11 జూన్ 2018 (15:40 IST)
శరీరాన్ని  గురించి మనమెంత తక్కువుగా ఆలోచిస్తే అంత మంచిది అని చెప్పారు స్వామి వివేకానంద. ఎందుకంటే మనలను క్రిందకి దిగలాగేది ఈ శరీరమే అన్నారాయన. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... సంగత్వం, దేహాత్మభ్రాంతి- ఇవే మన దుఃఖాలకు కారణం. రహస్యం ఏమిటో తెలుసా, నేనీ దేహాన్ని కాను, ఆత్మను. ఈ సమస్త ప్రపంచం, దానిలోని సర్వబంధాలు-మంచీ చెడులు, సుఖధుఃఖాలు ఇవన్నీ ఒక తెరమీద చిత్రీకరించిన బొమ్మల వంటివి. వీటన్నింటిని చూస్తూ ఉండే ద్రష్టనే నేను అని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి.
 
పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు.
 
భౌతికసంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది.
 
భయపడవద్దు... జాగరూకతతో పనిలో నిమగ్నం కండి. గమ్యం చేరుకునేంతవరకూ ఆగవద్దు.
 
పరిపూర్ణ అంకిత భావం. పవిత్ర, అతిసునిశితమైన బుద్ది, సర్వాన్ని జయించగల సంకల్పం- వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా మెుత్తం ప్రపంచంలో పెను మార్పు సంభవిస్తుంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments