వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబ

గురువారం, 28 డిశెంబరు 2017 (21:57 IST)
ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబోతోంది. సూర్యుడు ధనస్సులో ప్రవేశానంతరం మకర సంక్రమణం సంభవించే మధ్య కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో పాటు భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడని హిందూ ధర్మాలు చెబుతున్నాయి. 
 
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందున దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, శివుడు ఈ రోజే హాలాహలాన్ని త్రాగాడని ప్రతీతి. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశం చేసాడని విశ్వాసం ఉంది.
 
మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. తద్వారా భక్తులు ఆ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు చేస్తుంటారు, మరీ ముఖ్యంగా ఉపవాసం, జాగరణ చేస్తూ దేవదేవుడిని కొలుస్తారు. తిరుమలలో స్వామివారు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని కలగజేస్తాడు.

అన్నీ చూడండి

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. పెళ్లి పేరెత్తేసరికి గర్భస్రావం.. ఎక్కడ?

భూవివాదం... చెల్లికి సపోర్ట్ చేసిందని మహిళను హత్య చేసిన సోదరుడు

మూడు, నాలుగు మంది పిల్లలు సరే.. సిజేరియన్‌తో హై రిస్క్.. హెచ్చరిస్తున్న వైద్యులు

Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు

సహ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం మత్తులో...?

అన్నీ చూడండి

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments