లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకుంటే అష్టైశ్వరాలు చేకూరుతాయా?

శనివారం, 28 సెప్టెంబరు 2019 (19:25 IST)
ఐశ్వర్యం కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి సత్ర్పవర్తన కలిగి వుండి, సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ వుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటుంది శాస్త్రం. లోహాలతో చేసే తాబేళ్లు అలంకార సామగ్రి మాత్రమే. వాటితో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నది కేవలం ఓ నమ్మకం మాత్రమే. ఇందుకు శాస్త్రీయమైన ప్రమాణం ఏమీ లేదు. 
 
ఇకపోతే వెండి, రాగి, ఇత్తడి తదితర పంచలోహాలతో చేసే యంత్రాలను పూజా మందిరంలో వుంచి, నిత్య పూజాధికాలు చేసే పద్ధతి వుంది. ఈ యంత్రాలపైన రేఖల రూపంలో, బీజాక్షరాలతో దైవీశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కావాలి. 
 
కేవలం యంత్రం పైన రేఖలు, అలంకారం వుంటే సరిపోదు. సంబంధిత దేవత మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ట చేసినప్పుడే వాటిలోని దైవీశక్తి కొలువుంటుంది. అలా చేయని యంత్రాలు అలంకారప్రాయంగానే నిలుస్తాయి.

అన్నీ చూడండి

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని.. ఫోటోలు వైరల్

ప్రధాని మోడీ పొదుపు మంత్రం - ఎద్దుల బండిపై పోలీస్ కానిస్టేబుల్ బారాత్

ప్రేమికుల పెళ్లి విషయంలో రూ. 70 వేల లంచం అడిగిన ఎస్సై, ACBకి పట్టించారు

అరుదైన ఖనిజ నిక్షేపాలలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్: B2K విశ్లేషణ

అన్నీ చూడండి

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

తర్వాతి కథనం
Show comments