అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ.7.5 కోట్లు

గురువారం, 7 అక్టోబరు 2021 (21:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు నడిచివెళ్లే అలిపిరి నడకమార్గాన్ని మరింతగా సుందరీకరించనుంది. ఇందుకోసం రూ.7.5 కోట్ల నిధులను కేటాయించింది. 
 
అలాగే, కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. ఇకపోతే, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్మూలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదించారు.
 
తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల ఆరోగ్య నిధికి కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్ కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. 
 
స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ నిర్మాణాలకు రూ.4.46 కోట్ల నిధులు కేటాయించారు. వరాహస్వామి విశ్రాంత భవనం-2లో మరమ్మతులకు రూ.2.61 కోట్లు మంజూరు చేశారు. వీటితోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా తితిదే పాలక మండలి ఆమోదం తెలిపింది. 

అన్నీ చూడండి

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

ముద్దుల్లో ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రెజిల్ ప్రేమజంట

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

12-07-2026 నుంచి 18-07-2026 వరకు మీ వార ఫలితాలు

12-07-2026 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు...

Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..

తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం (video)

11-07-2026 శనివారం ఫలితాలు- వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు

తర్వాతి కథనం
Show comments