అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ.7.5 కోట్లు

గురువారం, 7 అక్టోబరు 2021 (21:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు నడిచివెళ్లే అలిపిరి నడకమార్గాన్ని మరింతగా సుందరీకరించనుంది. ఇందుకోసం రూ.7.5 కోట్ల నిధులను కేటాయించింది. 
 
అలాగే, కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. ఇకపోతే, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్మూలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదించారు.
 
తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల ఆరోగ్య నిధికి కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్ కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. 
 
స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ నిర్మాణాలకు రూ.4.46 కోట్ల నిధులు కేటాయించారు. వరాహస్వామి విశ్రాంత భవనం-2లో మరమ్మతులకు రూ.2.61 కోట్లు మంజూరు చేశారు. వీటితోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా తితిదే పాలక మండలి ఆమోదం తెలిపింది. 

అన్నీ చూడండి

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

తర్వాతి కథనం
Show comments