1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. TTD to build temples at Varanasi, Jammu

జమ్మూ - వారణాసిలో శ్రీవారి ఆలయాలు

TTD
జమ్మూ, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ, జమ్మూ ప్రభుత్వం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. 
 
ఈ ఏడాదిలోనే జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఈ ఆలయం కూడా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
08-02-2020 శనివారం దినఫలాలు - శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించినా...