శ్రీవారి భక్తులు త్వరపడండి, దర్సన టిక్కెట్ల కోటా విడుదల, ఎప్పుడంటే?

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (20:15 IST)
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్ల కోటాను ఫిబ్రవరి 20వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్లో విడుదల చేయనుంది.
 
అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్సన టిక్కెట్లను గదులను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 
గంటల తరబడి టోకెన్ల కోసం తిరుపతికి వచ్చి వెయిట్ చేయడం.. గదుల దొరక్క ఇబ్బంది పడకుండా సులువుగా ఆన్లైన్లో దర్సన టోకెన్లు, గదులను బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. అయితే ఎప్పుడు టిటిడి ఆన్లైన్లో దర్సన టోకెన్లు, గదులకు సంబంధించి కోటాను రిలీజ్ చేసినా రెండుమూడు గంటల్లోనే అయిపోతోంది. దీంతో చాలామంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అన్నీ చూడండి

రైతులు వేధింపులకు గురువుతున్నారు.. అమరావతిలో జగన్ భేటీ

జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య!

గ్రాడ్యుయేషన్ పరేడ్‌ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ (వీడియో)

తెలంగాణలో జనసేన బలపడుతుందా? ఆంధ్రా నాయకుడిగా ముద్రపడిందిగా?

కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

03-06-2026 బుధవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments