సంబంధిత వార్తలు
- తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు
- తిరుమలలో భక్తుల రద్దీ.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
- టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం
- వైశాఖ కృష్ణ పక్ష పంచమి: ఉజ్జయిన్ మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతి
- రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)
అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు
నంద్యాల జిల్లా, అల్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. బుధవారం నాడు, శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామి ఉత్సవ మూర్తులను వసంతోత్సవ మండపంలోకి ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
అనంతరం స్వామివారి విగ్రహాలకు పసుపు, చందనం, కర్పూర లేపనాలను అలంకరించి, ధూప, దీప నైవేద్యాలను సమర్పించి, మహా మంగళ హారతిని ఇచ్చారు. ఆ తర్వాత మూలవిరాట్టును అత్యంత సుందరంగా అలంకరించి, భక్తుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అశ్వ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఆలయ పుష్కరిణిలో తీర్థస్నానం ఆచరించడంతో ఉత్సవాలు ముగిశాయి.
