శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2020 (20:37 IST)

11,200 మార్క్ కన్నా తక్కువకు పడిపోయిన నిఫ్టీ, 400 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్

ఈ రోజు ఆటో మరియు బ్యాంకింగ్ రంగం కారణంగా బెంచిమార్కు సూచీలు తక్కువకు పడిపోయాయి. నిఫ్టీ 1.08% లేదా 122.05 పాయింట్లు తగ్గి 11,200 మార్క్ కంటే తక్కువగా అంటే 11,178.40 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 1.13% లేదా 433.15 పాయింట్లు పడిపోయి 37,877.34 వద్ద ముగిసింది. సుమారు 1600 షేర్లు క్షీణించగా, 1085 షేర్లు పెరిగాయి, 133 షేర్లు మారలేదు.
 
టాప్ నిఫ్టీ నష్టపోయిన వారిలో ఐషర్ మోటార్స్ (7.15%), టాటా మోటార్స్ (4.80%), ఎం అండ్ ఎం (3.27%), బజాజ్ ఫైనాన్స్ (2.59%), యాక్సిస్ బ్యాంక్ (2.63%) అగ్రస్థానంలో ఉండగా, జెఎస్‌డబ్ల్యు స్టీల్ (2.57%), కోల్ ఇండియా (2.33%), సన్ ఫార్మా (1.97%), సిప్లా (1.76%), మరియు ఎన్‌టిపిసి (1.55%) నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉన్నాయి.
 
మెటల్ మరియు ఫార్మా మినహా మిగతా అన్ని రంగాలు ఎరుపు రంగులో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 1.02 శాతం, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.61 శాతం తగ్గాయి.
 
వర్రోక్ ఇంజనీరింగ్ లిమిటెడ్
ఈ సంస్థ యొక్క ఏకీకృత నికర నష్టం రూ. 308.5 కోట్లు కాగా, ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ ఆదాయం 55.6% తగ్గింది. కంపెనీ స్టాక్స్ 7.68% తగ్గి రూ. 205.00 వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
ఎన్‌టిపిసి లిమిటెడ్
ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ నికర లాభం 5.9 శాతం తగ్గాయి, కంపెనీ ఆదాయం 2.6 శాతం తగ్గింది. అయితే నేటి ట్రేడింగ్ సెషన్లో కంపెనీ స్టాక్స్ 1.55% పెరిగి రూ. 88.60 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
జామ్నా ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్
వాణిజ్య వాహన రంగంలో కోలుకోవాలనే ఆశలు ఈ రంగంలో కొనుగోలుకు దారితీశాయి. ఫలితంగా, జామ్నా ఆటో ఇండస్ట్రీస్ స్టాక్స్ 4.19% పెరిగి రూ. 39,80 ల వద్ద త్రేడ్ అయ్యాయి.
 
ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్
సంస్థ యొక్క ఏకీకృత నికర లాభం 95% తగ్గాయి, సంస్థ యొక్క ఏకీకృత ఆదాయం 45% తగ్గింది. ఈ స్టాక్ 3.81% తగ్గి రూ. 61,540.00 ల వద్ద ట్రేడ్ అయింది.
 
నెస్కో లిమిటెడ్
సంస్థ యొక్క ఏకీకృత నికర లాభం 35% పెరిగింది, ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో ఆదాయం 11% తగ్గింది. అయితే కంపెనీ స్టాక్స్ 4.50% పెరిగి రూ. 516.05 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్
జూన్ తో ముగిసిన త్రైమాసంలో బ్యాంక్ మెరుగైన పనితీరును నమోదు చేసిన తరువాత బ్యాంక్ స్టాక్స్ 3.81% పెరిగి రూ. 121.25 వద్ద ట్రేడయ్యాయి. ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో నికర లాభం 16.9% క్షీణించగా, నికర వడ్డీ ఆదాయం 4.8% పెరిగింది.
 
బిపిసిఎల్ లిమిటెడ్
ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో బిపిసిఎల్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 43.8% పడిపోయింది, ఈ కాలంలో నికర లాభం రూ. 2,076 కోట్లు. అయితే కంపెనీ స్టాక్స్ 1.98% తగ్గి రూ. 412.80 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
హీరో మోటోకార్ప్
ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ నికర లాభం 95.1 శాతం క్షీణించగా, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 633 శాతం తగ్గింది. కంపెనీ స్టాక్ 0.49% స్వల్పంగా తగ్గి రూ. 2,796.00 ల వద్ద ట్రేడ్ అయింది.
 
భారతీయ రూపాయి
అస్థిర ఈక్విటీ మార్కెట్ల నడుమ భారత రూపాయి ట్రేడింగ్ స్వల్పంగా జరిగి, అమెరికా డాలర్‌తో రూ.74.90 వద్ద ముగిసింది.
 
మిశ్రమ గ్లోబల్ మార్కెట్ సూచనలు
ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణిని అంచనా వేస్తుండగా, యూరోపియన్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ సెషన్‌లో తక్కువ ట్రేడ్ అయ్యాయి. నాస్‌డాక్, నిక్కి-225 వరుసగా 0.27%, 0.17% పెరిగాయి, హాంగ్ సెంగ్ 0.19% పడిపోయింది. మరోవైపు, ఎఫ్‌టిఎస్‌ఇ 100 1.80 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 1.48 శాతం తగ్గాయి.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్