1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (12:59 IST)

యూరో 2020 : గోల్ కీపర్ కంగారు .. ప్రత్యర్థి ఖాతాలోకి పాయింట్

ఫుట్‌బాల్ క్రీడలో గోల్‌కీపర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే గోల్ కీపర్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రత్యర్థి ఖాతాలోకి పాయింట్ పడిపోతుంది. తాజాగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్‌కీపర్‌కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. 
 
గోల్‌ కీపర్‌ కంగారుతో ప్రత్యర్థి ఖాతాలో పాయింట్‌ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్‌ ఆడియెన్స్‌లో టెన్షన్‌ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
 
యూరో 2020లో భాగంగా స్పెయిన్‌, క్రోయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(​‍స్పెయిన్‌ క్లబ్‌) మిడ్‌ ఫీల్డర్‌ పెడ్రి బంతిని పాస్‌ చేయగా.. అది గోల్‌కీపర్‌ ఉనయ్‌ సైమన్‌ ముందుకొచ్చింది. 
 
అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్‌ నెట్‌ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు.
 
ఇక ఆ తర్వాత మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు సైమన్‌ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్‌ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్‌.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్‌ గోల్‌ తర్వాత సైమన్‌ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు.