1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (18:10 IST)

డబుల్స్ టైటిల్ నెగ్గిన పేస్: వైన్‌ తాగనంటోన్న షరపోవా!

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఖాతాలో మరో డబుల్స్ టైటిల్ వేసుకున్నాడు. హెయినికన్ ఓపెన్ డబుల్స్‌ను దక్షిణాఫ్రికా ఆటగాడు రావెన్ క్లాసెన్ తో కలసి పేస్ గెలుచుకున్నాడు. డబుల్స్ ఫైనల్ పోరులో బ్రిటన్, రొమేనియా ఆటగాళ్లతో కూడిన జోడీని పేస్ ద్వయం 7-6, 6-4 తేడాతో మట్టికరిపించడం ద్వారా టైటిల్‌ను గెలుచుకుంది. 
 
ఇదిలా ఉంటే.. త్వరలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న వరల్డ్ నెంబర్-2 మరియా షరపోవా తనకెంతో ఇష్టమైన వైన్‌ను తాగరాదని నిర్ణయించుకుంది. తనను తాను నిరూపించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 
 
ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిస్తే షరపోవా తిరిగి వరల్డ్ నెంబర్-1గా నిలవనుంది. కాగా, షరపోవా 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. మొత్తం 5 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు గెలుచుకున్న షరపోవా, మరోసారి మెల్బోర్న్ పార్క్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.