గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2024 (15:27 IST)

డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయి.. శంషాబాద్‌లో స్వాధీనం

ganja
శంషాబాద్‌లో డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయిని దాచి ఉంచిన కంటైనర్‌ను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో స్మగ్లర్లు ఒడిశా నుంచి నిషిద్ధ వస్తువులు తీసుకువస్తుండగా కంటైనర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 
 
సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌ బృందం (ఎస్‌ఓటీ) కంటైనర్‌ తలుపులు తెరిచి చూడగా ముందు వరుసలో రసాయనాలు నింపిన కొన్ని డ్రమ్ములు కనిపించాయి. 
 
ఎస్‌ఓటీ బృందం వాటిని పరిశీలించగా, గంజాయి సాచెట్‌లతో నిండిన బ్లూ కలర్ డ్రమ్ములు కనిపించాయి. బృందం వెంటనే కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంది. డ్రైవర్‌ను విచారించిన తర్వాతే గంజాయి స్మగ్లింగ్‌పై మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు.