1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Nara Lokesh Makes Interesting Comments on TDP in Telangana

తెలంగాణలో టీడీపీ పునరుద్ధరణపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

nara lokesh
తెలంగాణలో పార్టీ పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు కార్యకలాపాల కోసం త్వరలో సమగ్ర ప్రణాళికను వెల్లడిస్తామని లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. సమీప భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ వివిధ కార్యక్రమాలను ప్రారంభించాలని యోచిస్తోందన్నారు. 
 
రాష్ట్రంలో శాసనసభలో సిట్టింగ్ సభ్యులు (ఎమ్మెల్యేలు) లేనప్పటికీ, తెలంగాణలో 1.60 లక్షల మంది ఇటీవల టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని లోకేష్ హైలైట్ చేశారు. ఇది ఒక ముఖ్యమైన విజయంగా, తెలంగాణలో పార్టీకి ప్రజా మద్దతుకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
 
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో దివంగత టీడీపీ వ్యవస్థాపకుడుస మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సందర్భంగా లోకేష్ ఎన్టీఆర్ వారసత్వం గురించి మాట్లాడారు.
 
తెలుగు మాట్లాడే ప్రజలను "మద్రాసీలు" అని అవమానకరంగా పిలిచే సమయంలో వారిలో గర్వభావాన్ని కలిగించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కిందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలను మార్గదర్శక సూత్రంగా తీసుకుని టీడీపీ ముందుకు సాగుతుందని లోకేష్ ఉద్ఘాటించారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఎన్టీఆర్ కు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రదానం చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
13 Kilometers in 13 Minutes: గుండె మార్పిడిలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర