తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను ప్రకటించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో, బాలికలు అద్భుతంగా రాణించారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వారిలో బాలికలు 73.83 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,88,430 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,22,191 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలికలు 74.21 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,08,582 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,33,908 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ను నమోదు చేయడం ద్వారా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ https://results.cgg.gov.in/ లో తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. మార్చి 5 నుండి మార్చి 25 వరకు 1,532 కేంద్రాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరిగాయని గుర్తుచేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.