1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:15 IST)

కాంగ్రెస్ పార్టీలోకి 15 మంది ఎమ్మెల్యేలు : షబ్బీర్ అలీ

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. 
 
ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందన్నారు. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం కేసీఆర్‌ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.