ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:37 IST)

దంపతుల గొడవ.. భార్యపై భర్త దాడి.. 21 రోజుల బాబును అడ్డుపెట్టడంతో..?

ఆదర్శంగా వుండాల్సిన తల్లిదండ్రులు ప్రస్తుతం కన్నబిడ్డల పాలిట శాపంగా మారుతున్నారు. తాజాగా తల్లిదండ్రుల మద్యం మత్తు వారి చిన్నారి మరణానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోనీ పూసలబస్తీలో నివసించే రాజేశ్, జాహ్నవి దంపతులు నిత్యం మద్యం సేవించి గొడవపడేవారు. శుక్రవారం కూడా ఇరువురు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన రాజేశ్.. జాహ్నవి మీద దాడి చేశాడు. 
 
భర్త దెబ్బలు తాలలేక.. జాహ్నవి తన చేతిలోని 21 రోజుల బాబును అడ్డుపెట్టింది. దాంతో చిన్నారికి బలంగా దెబ్బ తగిలింది. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సైదాబాద్ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని పసికందు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని రిమాండ్‎కు తరలించారు.
 
ఘటన జరిగిన ప్రాంతానికి నిందితుడు రాజేశ్‎ను తీసుకెళ్లి పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ నిర్వహించారు. ఘటన జరిగిన ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా గొడవ పడ్డారు, గొడవలో పసికందు ఎలా మృతి చెందాడు అని ఆరా తీశారు.