మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 19 జూన్ 2019 (14:38 IST)

ప్రియుడి మోజులో.. ఓ క‌న్న‌త‌ల్లి చేసిన దారుణం..!

కన్న త‌ల్లి.. పిల్ల‌ల‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిందిపోయి.. ప్రియుడి మోజులో ప‌డి దారుణానికి ఒడిగ‌ట్టింది. వివ‌రాల్లోకి వెళితే.... భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామ‌వ‌రంలో ఓ మ‌హిళ తన సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఆ మహిళ.. భర్తలేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. అయితే.. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న తన ఇద్దరు పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ప్రియుడితో కలిసి ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చితకబాదింది. అంతటితో ఆగకుండా పిల్లలను ఒళ్ళంతా వాత‌లు పెట్టింది. 
 
ఈ విష‌యం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వ‌చ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సుఖం కోసం తన పిల్లలను స్వ‌యంగా తల్లే దారుణంగా చిత్రహింసలకు గురిచేయ‌డం అక్క‌డ ఉన్న వారిని క‌లిచివేసింది.