వరంగల్‌ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:00 IST)
వరంగల్‌ జిల్లా దామోదర మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని పసరగొండ వద్ద లారీ, కారు ఢకొీన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులు మేకల రాకేశ్‌, మేడి చందు, రోహిత్‌, సాబీర్‌, పవన్‌గా పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

పరకాల ఎసిపి శ్రీనివాస్‌ ఘటనా స్థలికి చేరుకొని సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్

Rajamouli: ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ లూమియర్ వారి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు

జగపతి బాబు, లయ నటించిన వదలా చిత్రం రిలీజ్ కు సిద్ధం

Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం

VISA – వింటారా సరదాగా రెండో గీతం చింగారి కి స్పందన

తర్వాతి కథనం
Show comments