అన్నం పెట్టనన్నందుకు భార్యను అంతం చేసిన భర్త

శనివారం, 5 డిశెంబరు 2020 (14:42 IST)
ఇటీవలి కాలంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని మీర్ పేటలో దారుణం జరిగింది.
 
తనకు అన్నం పెట్టమని అడగ్గానే పెట్టలేదన్న కోపంతో ఓ భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. వివరాల్లోకి వెళితే... మీర్ పేట పరిధిలో 40 ఏళ్ల జయమ్మ భర్త శ్రీనివాస్, కుమారుడితో కలిసి వుంటోంది. నిన్న రాత్రి ఆమె కుమారుడిని తీసుకుని బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చింది.
 
ఇంటికి వచ్చిన భార్యను తనకు అన్నం పెట్టాలంటే అడిగాడు భర్త. ఐతే ఆ సమయంలో అన్నం వండేందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహం చెందిన భర్త భార్య చీరను లాగి ఆమె గొంతుకి బిగించి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

సుధీర్ జోకర్ బ్యాంగర్ రిలీజ్, ఫ్యాన్స్ సందడి మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్

Janhvi Kapoor: రామ్ తో నటన దైవసంబంధం - బుచ్చిబాబు రౌడీ దర్శకుడు : జాన్వీ కపూర్

Virosh: రమణి కళ్యాణం ప్రోమో విరోష్ పెళ్లి మ్యాజిక్‌ను టీజర్‌తో మేళవించింది

అక్కడకు మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా తలకు హెల్మెట్ పెట్టుకోండి : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments