1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 మే 2021 (17:59 IST)

గాంధీకి కేసీఆర్, రేవంత్ డిమాండ్లు, ఏంటవి?

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా కొన్ని డిమాండ్లు చేశారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలన్నారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్‌ను ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలని రేవంత్‌ అన్నారు. కోవిడ్‌తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని వ్యాఖ్యానించారు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు. నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదని రేవంత్‌రెడ్డి తెలిపారు.