సంబంధిత వార్తలు
- పుట్టినరోజు వేడుకపై పోలీసు కేసు!
- సింహం సింగిల్గానే వస్తుంది, పార్టీ పేరు జూలై 8న చెపుతా: వైఎస్ షర్మిల
- వైఎస్. షర్మిళ కాన్వాయ్లో ప్రమాదం.. నలుగురికి గాయాలు...
- అశ్లీల వెబ్సైట్లు చూస్తూ.. బ్లాక్మెయిల్.. నగ్నంగా మాట్లాడాలని...?
- తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ.. ఖమ్మంలో సంకల్ప సభ.. 6వేల మందికే పర్మిషన్
ముగ్గురు మహిళా పోలీసులు... మూడు తప్పులు.. ఏంటవి?
సమాజం కోసం బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముగ్గురు మహిళా పోలీసులు మూడు తప్పులు చేశారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అపరాధం విధించారు. ఇంతకీ ఆ ముగ్గురు పోలీసులు చేసిన తప్పులేంటో తెలుసుకుందాం.
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ ముగ్గురూ ఒకే స్కూటీ ఎక్కారు. శిరస్త్రాణాం ధరించలేదు. పైగా రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్ఫోన్లో సంభాషించారు. ఇలా ట్రాఫిక్ నిబంధనల పరంగా ఒకటి కాదు.. మూడు ఉల్లంఘనలకు పాల్పడిన తీరుపై నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన షర్మిల సభ కోసం ఈ ముగ్గురూ విధులు నిర్వహించేందుకు ఇలా ఒకే బైక్ మీద వెళ్లారు. వీరు ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలో నుంచి వెళుతుండగా కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
గత రెండ్రోజులుగా ఈ ఫొటో వైరల్ అవుతోంది. కాగా మహిళా కానిస్టేబుళ్ల ఈ నిర్లక్ష్యంపై ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ సీరియస్ అయ్యారు. వారికి రూ.3300 జరిమానా విధించాలని, అలాగే శాఖాపరమైన చర్యలూ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తర్వాతి కథనం
