సంబంధిత వార్తలు
- తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ.. ఖమ్మంలో సంకల్ప సభ.. 6వేల మందికే పర్మిషన్
- వైఎస్ వివేకా హత్యపై నిగ్గు తేల్చాల్చిందే.. విభేదాలు లేవండోయ్: విజయమ్మ
- మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
- పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్లో రాసిచ్చిన ఘనుడు ఎక్కడ?
- వైఎస్ఆర్.. ఇట్స్ ఏ బ్రాండ్.. ఇక పొత్తులెందుకు: వైఎస్.షర్మిల
వైఎస్. షర్మిళ కాన్వాయ్లో ప్రమాదం.. నలుగురికి గాయాలు...
వైఎస్ఆర్ పుత్రిక వైఎస్. షర్మిల కొత్త పార్టీ ఆవిష్కరణ సభ శుక్రవారం ఖమ్మంలో జరుగనుంది. ఇందుకోసం ఖమ్మం వెళుతోన్న వైఎస్ షర్మిల కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వైఎస్ షర్మిల సంకల్ప సభ జరగనుంది. ఇందుకోసం ఈ ఉదయం హైదరాబాద్ లోటస్పాండ్లోని నివాసం నుంచి ఖమ్మం సభకు భారీ కాన్వాయ్తో బయల్దేరారు.
అయితే, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల ఖమ్మం చేరుకోవాల్సి ఉంది. శుక్రవారం జరిగే సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదిస్తారు. అటు, ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్ అభిమానులు తరలివస్తున్నారు.
సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
While I embark on the most important journey of my life in the path of late YSR garu .. I paused for a second to say thank you for all the support and courage you give me, Dear Anil. This is the new beginning for us and for the people of Telangana. #SankalpaSabha #ChaloKhammam https://t.co/AuzJHq0XHI
— YS Sharmila (@realyssharmila) April 9, 2021
తర్వాతి కథనం