సంబంధిత వార్తలు
- వైఎస్ఆర్.. ఇట్స్ ఏ బ్రాండ్.. ఇక పొత్తులెందుకు: వైఎస్.షర్మిల
- ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం`లోని పాటను విడుదల చేసిన వై.ఎస్.షర్మిల
- వైఎస్ షర్మిల కొత్త పార్టీ ముహూర్తం ఫిక్స్.. టీఆర్ఎస్కో, బీజేపీకో 'బి'టీమ్గా..?
- వైఎస్. షర్మిల కొత్త పార్టీ వెనుక ప్రధాని మోడీ హస్తం : జేసీ కామెంట్స్
- వైఎస్ షర్మిలను చూసి దూరంగా పారిపోతున్న వైసిపి నాయకులు, ఎందుకో?
పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్లో రాసిచ్చిన ఘనుడు ఎక్కడ?
తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కొత్తగా పార్టీని ఏర్పాటు చేయనున్న వైఎస్.షర్మిల మండిపడ్డారు. 'నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపరో ఇచ్చారంట... బాండ్ పేపర్ ఇచ్చి రైతులను దగా చేశారట' అంటూ అరవింద్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఆమె శుక్రవారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. శుక్రవారం లోటస్ పాండ్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా? పసుపు రైతుల కష్టాలు వర్ణనాతీతం, ఎక్స్టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా? ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాలు కనపడటం లేదా? బైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఉండటం లేదా?' అని ప్రశ్నించారు.
తర్వాతి కథనం
