1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మొయినాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. 16 యేళ్ల యువతి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 యేళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళుతున్న సమయంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 యేళ్ల ప్రేమిక అనే యువతితో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం సేవించి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 
 
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ప్రేమిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తేగానీ ఏపీ చెప్పలేమని వైద్యులు తేల్చారు. ఈ గాయపడిన వారిలో అక్షర (14) 9వ తరగతి చదువుతుండగా, సౌమ్య (18) అనే విద్యార్థిని డిగ్రీ చదవుతోంది. చనిపోయిన ప్రేమిక మాత్రం ఇంటర్ మొదటి సంవత్సరం. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడం గమనార్హం.