ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (12:03 IST)

రోగిని రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు..

patient
patient
నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్ట్రెచర్‌ ఉన్నా పట్టించుకోకుండా వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఓ రోగిని సొంత బంధువులే నేలపైకి ఈడ్చుకెళ్లిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మార్చి 31 సాయంత్రం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి నడవలేని స్థితిలో ఉన్నాడని అతని బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. 
 
అతన్ని రాత్రంతా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ వెలుపల కూర్చోబెట్టారు. మరుసటి రోజు ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టారు. అతనిని నమోదు చేయగానే, ఆసుపత్రి సిబ్బంది అతనికి రెండవ అంతస్తులో ఉన్న వైద్యుడిని చూడటానికి టోకెన్ ఇచ్చారు. 
 
అయితే, రెండవ అంతస్తుకు చేరుకోవడానికి, స్ట్రెచర్ లేదా వీల్ చైర్ అవసరం. కానీ అవి ఆస్పత్రిలో దక్కకపోవడంతో రెండు కాళ్లతో ఈడ్చుకెళ్లారు.