సంబంధిత వార్తలు
- టీమిండియాలో బెర్తు కోసం ఎదురు చూడటం లేదు : హార్దిక్ పాండ్యా
- కిషన్ రెడ్డి , రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు.. ఏం తెలుసురా బిడ్డ నీకు..?
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు
- రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ : బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు
- కేసీఆర్ ఫార్మ్ హౌజ్కి నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్: రేవంత్ రెడ్డి
ఓడించాలని ప్రశాంత్ కిషోర్ పిలుపునిస్తారు : రేవంత్ రెడ్డి
తెరాసను
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఆయన పార్టీ ఓడించాలని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఓడిస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్, ప్రశాంత్కిషోర్ల మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, వారి మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిపోనుందన్నారు.
కాంగ్రెస్లో చేరిన తర్వాత ప్రశాంత్ కిషోర్తో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పీఏసీ)కి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్పై పోరు సన్నాహాలను చర్చిస్తారని రేవంత్ రెడ్డి నిర్ద్వంద్వంగా ప్రకటించారు.