Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనపర్తి జిల్లాలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు - 15 మందికి గాయాలు

Written By ఠాగూర్
Published: ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:24 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అయితే, అందరికీ స్వల్పగాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జాతీయ రహదారి ఎన్.హెచ్.44 రోడ్డుపై జరిగింది. 
 
కొత్తకోట బైపాస్ సమీపంలో యాదగిరి గుట్టకు చెందిన ఆర్టీసీ బస్సు టీఎస్ 30 జడ్ 0015గా గుర్తించారు. ఈ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. యాదగిరి గుట్ట నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్ఐ, అతని బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments