సంబంధిత వార్తలు
- 28-11-2021 ఆదివారం రాశిఫలాలు : ఆదిత్య హృదయం చదివిన లేక ఆలకించినా శుభం
- వారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిఆర్ సి సమావేశం
- 27-11-2021 శనివారం మీ రాశిఫలాలు : లక్ష్మీనారాయణస్వామిని ఆరాధించిన...
- నవంబర్ 26 నుంచి ఎయిర్టెల్.. బాదుడే బాదుడు
- 26-11-2021 శుక్రవారం మీ రాశిఫలాలు : పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు...
నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ!
తెలంగాణా రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులంతా కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సారథ్యంలో తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగనుంది.
ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెరాసకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా హాజరుకానున్నారు. ఇందులో పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిచి, సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యంగా, రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు, వరి ధాన్యానికి మద్దతు ధర, వ్యవసాయ చట్టాల రద్దు, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వం వైఖరి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలు తదితర అంశాలపై పార్టీ వైఖరిని, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన తీరుపై సీఎం పలు సూచనలు చేయనున్నారు.
తర్వాతి కథనం
