సంబంధిత వార్తలు
- తెరాస అధినేత, సీఎం కేసీఆర్కు బండి సంజయ్ 21 ప్రశ్నలు
- సీఎం కేసీఆర్కు 21 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలి.. బండి ప్రశ్న
- టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్ 11 తీర్మానాలు.. 33 రకాల వంటకాలు
- భారతదేశపు మొట్టమొదటి కార్బన్ ఆఫ్సెట్ ఎన్ఎఫ్టీని విడుదల చేసిన టీఆర్ఎస్టీ01
- టిక్కెట్ రేట్ పెంచడంలో తప్పులేదు - చిరంజీవి
ప్రజల గుండెల్లో తెరాసకు సుస్థిర స్థానం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు సుస్థిర స్థానం ఉందని ఆ రాష్ట్ర మంత్రి, తెరాస సీనియర్ నేత ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు బుధవారం హైదరాబాద్ నగరంలో ప్రారంభమయ్యాయి. ఇవి రెండు రోజుల పాటు సాగనున్నాయి.
ఈ ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, తెరాస పార్టీ ఇంతింతై వటుడింతే అన్న చందంగా 2001 నుంచి నేటి వరకు 21 యేళ్ళుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని తెలిపారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక బలమైన సిద్ధాంత పార్టీగా పేరు గడించిందని తెలిపారు.
తమ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను, విజయాలను చవిచూసిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలైన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు.