సంబంధిత వార్తలు
- పూజా హెగ్డేను చిరంజీవి ఎందుకు దగ్గరకు లాక్కున్నారో తెలుసా!
- పవన్ కళ్యాణ్ బాబాయ్తో సినిమా చేస్తా- రామ్చరణ్
- భారతీయ సినిమాకి పీఠాధిపతి ఎస్ఎస్ రాజమౌళి: ఆచార్య ప్రి-రిలీజ్లో మెగాస్టార్ చిరంజీవి
- ఆచార్యలో హింస వుంది అందుకే యు/ఎ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
- రాజమౌళికి ఆచార్యకు సంబంధం చాలా వుందంటున్న చిరంజీవి
టిక్కెట్ రేట్ పెంచడంలో తప్పులేదు - చిరంజీవి
Chiranjeevi
“చిరంజీవి సినిమా అంటేనే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ఆచార్యకి టికెట్ రేటు పెంచవలసినన అవసరం ఉందా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరు మాట్లాడుతూ” పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది. వడ్డీగా 50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా? ఎవరిస్తారు చెప్పండి?.
ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు. వినోదాన్ని అందించే ప్రయత్నంలో అనుకోకుండా అంతకంతకీ వడ్డీలు అయ్యాయి. వడ్డీనే ఒక మీడియం సినిమా బడ్జెట్ అంత అయింది. మేము కూడా 42 పర్సెంట్ టాక్స్ లు కడుతున్నాము. అందులో కొద్దిగా తిరిగి ఇవ్వండి అని అడగడంలో తప్పేమి లేదు.. తప్పు అని కూడా అనుకోవడం లేదు” అని అన్నారు. ఇది హాట్ టాపిక్గా మారింది.
