1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (15:06 IST)

పాల్వంచ ఘ‌ట‌న: వనమా రాఘవకు బెయిల్ మంజూరు

Vanama
పాల్వంచ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది. నాగ రామ‌కృష్ణ కుటుంబాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ బెదింరిచార‌ని, వేధింపుల‌కు గురి చేశార‌ని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.  
 
ఈ నేపథ్యంలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ హైకోర్టులో ఊరట లభించింది. వనమా రాఘవకు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 
 
రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ 61 రోజులు జైల్లో ఉన్నాడు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్ట్..రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  
 
కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని షరతు విధించిన హైకోర్టు..ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని షరతు విధించింది.