1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 31 మే 2021 (10:06 IST)

పూజల పేరుతో మహిళపై అత్యాచారం!

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపంపులలో పూజల పేరుతో బురిడీ బాబాలు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా.. దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీగా నగదు వసూలు చేశారు.

అయినా బెదిరింపులు ఆగక పోవడంతో చివరకు బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీడియోలు డిలీట్ చేయించి.. బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు ఇప్పించారు. మిగితా డబ్బు ఇవ్వక పోవడంతో రాచకొండ సీపీని బాధితురాలు ఆశ్రయించింది.

వెలుగుచూసిన పోలీసులు, బాబాల బాగోతం విచారణలో వెలుగు చూసింది. కేసులో నిర్లక్ష్యం వహించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు రావడంతో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్‌లను సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు.