1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 3 డిశెంబరు 2014 (14:45 IST)

పశువుల కొష్టాంలో త్రిష స్వచ్ఛ భారత్... బొచ్చెలో ఎత్తిపోస్తున్నదేంటో...?!!

స్వచ్ఛ భారత్ అనగానే చాలామంది ఏదో మురుగు కాల్వలు, రోడ్లు, పాఠశాల ఆవరణలు శుభ్రపరచడాన్ని చూస్తూ ఉన్నాం. కానీ మాజీ మిస్ చెన్నై త్రిష మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకుంది. చెన్నైలోని తాంబరంలోని ముడిచుర్ లోని జంతుసంరక్షణ శాలను శుభ్రపరిచింది. 
 
పశువుల శాలకు వెళ్లి దాదాపు 2 గంటలపాటు త్రిష, తన స్నేహితురాళ్లతో కలిసి కష్టపడి అక్కడి చెత్తనంతా ఎత్తిపోసింది. 2015 జనవరి నుంచి త్రిష శుభ్రపర్చిన పశువుల శాల లోకి జంతువులను ఉంచుతారట. అందువల్ల అవి వచ్చేముందే అక్కడ శుభ్రం చేసినట్లు త్రిష చెపుతోంది. అవున్లెండి... ఆల్రెడీ జంతువులున్న చోట స్వచ్ఛ భారత్ చేస్తే ఫోటోల్లో అంత నీట్ గా పడరు కదా...?!!