గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (19:16 IST)

అడ్వాన్స్ తీసుకుని చెక్కేసిన భామ.. కేసు పెట్టిన చిత్ర యూనిట్ (Video)

తెలుగులో వచ్చిన చిత్రం "అర్జున్ రెడ్డి". విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, హీరోయిన్‌గా ఉత్తరాది భామ షాలిని పాండే. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో బోల్డ్‌గా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 
 
ఈ కోవలోనే తమిళంలో హీరో విజయ్ ఆంటోనీతో నటించేందుకు అంగీకరించి, అడ్వాన్స్‌ తీసుకుని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. ఆ తర్వాత ఆమె స్పందించడం లేదు. కొన్ని రోజులు సజావుగా సెట్స్‌కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. షాలినీపై అంతకుముందే తెలుగు, తమిళ నిర్మాతల మండలిలోనూ ఫిర్యాదు చేశారు. 
 
మరోవైపు, షాలినీ ఇటీవలే బాలీవుడ్‌లో అదిరిపోయే చాన్సును కొట్టేసింది. నవతరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన 'జయేశ్ భాయ్ జోర్దార్' అనే అనే చిత్రంలో నటించేందుకు సమ్మతం తెలిపింది. బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందన్న అహంకారంతో ఈ విధంగా ప్రవర్తిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.