ఎన్టిఆర్తో అడ్డాల సినిమా.. కథా చర్చలు జరిగాయట
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత.. కొంత గ్యాప్ తీసుకుని.. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్తో సినిమా చేస్తున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తాజాగా ఈయన ఎన్టిఆర్తో సినిమా చేస్తున్నాడని వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే ఎన్టిఆర్, శ్రీకాంత్ మధ్య కథా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ నెలాఖరులో రభస విడుదల కానుంది. దాని తర్వాత పూరీ జగన్నాథ్ చిత్రం ఎలాగూ వుంది. ఆ తర్వాత అడ్డాల చిత్రముంటుందని అంటున్నారు. దీనికి ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు కాస్త ఎంటర్టైన్మెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.