శ్రీను వైట్లకు కష్టకాలమా?
దర్శకుడు శ్రీను వైట్లకు ప్రస్తుతం పరీక్షాలకాలం మొదలైంది. గతంలో ఆయన సరసన ముగ్గురు ప్రముఖ రచయితలు వుండేవారు. వారు రాసిన పంచ్డైలాగ్లు బాగా పేలాయి. సినిమాలు బాగా ఆడేవి. ఆ విషయంలో శ్రీను వైట్ల ఇగో వల్ల వారు దూరమయ్యారు. వివరాల్లోకి వెళితే.... గతంలో శ్రీను వైట్ల చిత్రాలన్నింటికి కోనవెంకట్, గోపీమోహన్ వంటివారు ప్రయాణం సాగించేవారు. కానీ సినిమాకు డైలాగ్స్లు అన్నీ తానే రాసినట్లు ప్రకటించడంతో అసలు గొడవ మొదలైంది.
దాంతో కోనవెంకట్, గోపీమోహన్లు శ్రీను వైట్లకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు. దాంతో వారు ఆయనకు దూరంకావడం జరిగింది. ఆ తర్వాత కోనవెకంట్.. సింగిల్ హ్యాండ్తో 'గీతాంజలి' అనే సినిమాను తీసి సక్సెస్ సాధించాడు. పిమ్మట శ్రీనువైట్ల 'ఆగడు' చిత్రంలో కోనవెంకట్ రాసే పంచ్డైలాగ్లు కొత్త రచయితలతో రాయించి బోరు కొట్టించాడు. ఇదే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. భవిష్యత్లో రామ్ చరణ్ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించే విషయంపై అనుమాన నీడలు కమ్మినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.