1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:58 IST)

పెళ్ళయిన తర్వాత కూడా నా భర్త అఫైర్ కొనసాగింది : పూనమ్ సిన్హా

బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా. ఈయన భార్య పూనమ్ సిన్హా. ఈమె ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈమె ఒకపుడు బాలీవుడ్ నటి కూడా. ఈమెకు శతృఘ్నసిన్హలకు వివాహం 1980లో జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కపిల్ శర్మ టీవీ షోకు హాజరైన పూనమ్ తన జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తాము తొలిసారి పట్నా-ముంబై రైలు ప్రయాణంలో కలుసుకున్నట్టు చెప్పింది. ఆ సమయంలో శతృఘ్న తనతో మాట్లాడేందుకు ప్రయత్నించారని, ట్రైన్ ఒక గుహలో వెళుతుండగా ఆయన తన పాదాలను తాకారని చెప్పారు. 
 
అయితే, తనతో పెళ్లి జరిగే సమయానికే శతృఘ్నకు బాలీవుడ్ నటిట రీనారాయ్‌తో అఫైర్ ఉందని చెప్పుకొచ్చింది. తనకు భర్త అఫైర్ గురించి తెలుసని, దీంతో తాను వారి మార్గానికి అడ్డురాలేదని తెలిపారు. పెళ్లయిన తర్వాత కూడా వారి అఫైర్ కొనసాగిందన్నారు.
 
కాగా, రీనా, శతృఘ్నల అనుబంధం ఏడేళ్లు గడిచింది. ఇదే విషయమై శతృఘ్న కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీనాతో తన అఫైర్ పర్సనల్ అని, సాధారణంగా పెళ్లియితే మారిపోతారంటారని... కానీ, అప్పుడే తనకు రీనా మీద అభిమానం మరింత పెరిగిందన్నారు. ఆమె నాతో ఏడేళ్లు జీవితాన్ని పంచుకోవడం తన అదృష్టమన్నారు.