1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (14:08 IST)

త‌మ్ముడు ఆనంద్‌ కోసం అన్న విజ‌య్ చేస్తున్న `పుష్పక విమానం`

‘దొరసాని’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ తన మూడో సినిమాగా "పుష్పక విమానం" అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ సోమ‌వారం విడుద‌లైంది.
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు దామోదర మాట్లాడుతూ, ఈ కథని న్యూస్ లో చూసి ఇన్స్పైర్ అయి దానికి నిజ జీవిత పాత్ర‌ల‌ను జోడించి తయారు చేసుకున్నాను. మొదట ఈ కథని విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ గారికి చెప్తే ఆయనకి బాగా నచ్చడంతో ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. అదే టైంలో ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమా రిలీజ్అవడంతో ఈ కథకి అతను అయితే బావుంటాడని అనుకుని ఆనంద్ దేవరకొండ హీరో గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ, పెళ్లిచుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. ఇందులో ఆనంద్తోపాటు సునీల్, నరేష్ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. శాన్వి మేఘన, గీత్ సాయిని నాయిక‌లుగా చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. అందర్నీ అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుద‌ల‌చేయ‌నున్నామ‌ని అన్నారు.