శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:24 IST)

నటి శ్రీదేవి చీరలు వేలం.. ఎందుకో తెలుసా?

వెండితెర అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి ఈలోకం విడిచిపోయింది. కానీ, ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా చెదిరిపోలేదు. ముఖ్యంగా, శ్రీదేవి మరణించారన్న వార్తను ఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె ధరించిన కోటా చీరను వేలం వేయాలని ఆమె భర్త బోనీకపూర్ నిర్ణయించారు. ఆ వేలం ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యాలకు వినియోగించాలనేది ఆయన ఆశయం. 
 
ఈ చీరలను ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. వేలం ఆదాయాన్ని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిస్సహాయులు, వృద్ధుల కోసం, విద్యాభివృద్ధికి పనిచేసే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా, అబుదాబీలో సమీపబంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తు స్నానపు నీటి తొట్టిలో పడి చనిపోయిన విషయం తెల్సిందే. ఆమె చితాభస్మాన్ని కుటుంబసభ్యులు తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలో నిమజ్జనం చేశారు.