శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (23:13 IST)

ధనుష్‌తో జతకట్టనున్న ప్రియాంక అరుళ్ మోహన్ (video)

priyanka arul mohan
"గ్యాంగ్‌లీడర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్‌. మొదటి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'డాక్టర్', 'డాన్‌', 'ఈటీ' వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో మరింత చేరువైంది. 
 
ప్రస్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా ఈమె మరో స్టార్ హీరోతో జతకట్టనుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. తమిళ నటుడు ధనుష్‌.
 
కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ధనుష్‌. ఇటీవలే విడుదలైన "తిరు"తో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవలే ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఎంపికైంది. 
 
ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడు.