శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (23:16 IST)

మ‌హాశివ‌రాత్రినాడు వీరు ఏంచేశారో తెలుసా!

Rakul, samtha, laxmi
హీరోయిన్ల‌కు సెంటిమెట్లు ఎక్కువ‌. అందులో ల‌క్ష్మీమంచుకు మ‌రీను. స‌మంత‌, ర‌కుల్ స‌రేస‌రే. షూటింగ్‌కు బ‌య‌లుదేరేముందు ప్రార్థ‌న చేసుకుని మ‌రీ వ‌స్తుంది స‌మంత‌. అలాగే ర‌కుల్ కూడా. ఇంత సెంటిమెంట్ వున్న వీరు మ‌హాశివ‌రాత్రి వ‌చ్చిందంటే ఊరుకుంటారా. ఏకంగా కోయంబ‌త్తూరు చెక్కేశారు. ప్ర‌తి ఏడాది ఈషా ఫౌండేష‌న్ నిర్వ‌హించే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూ వుంటారు. స‌ద్గురు చెప్పిన బోధ‌న‌లు, యోగా విధానాలు పాటిస్తూ మెడిటేష‌న్ చేస్తుంటారు. ఈసారికూడా శివ‌రాత్రికి సినిరంగంలో ప‌లువురుకి ఆహ్వానాలు అందాయి. కొంత‌మంది న‌టీన‌టులు వెళ్ళారు. కానీ ఈ ముగ్గురు మాత్రం త‌మ సోష‌ల్‌మీడియాలో ఫొటోల‌కు ఫోజులిచ్చారు.

శివ‌రాత్రినాడు మాకు దొరికిన మ‌హాభాగ్యంగా వారు పేర్కొంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అశేషమైన భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం గురువారం రాత్రి జరిగింది. ఈ శివరాత్రి వేడుకల్లో సింగర్ మంగ్లీ పరమశివుడి గీతాలతో భక్తులను ఓలలాడించింది. సద్గురు కూడా నటరాజు భంగిమల్లో నృత్యం చేసి వారిలో మరింత ఉత్సాహం నింపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్స్ స‌మంత‌, రకుల్ ప్రీత్ సింగ్, మంచు ల‌క్ష్మీ హాజరు అయ్యారు. వారితో పాటు అటు తమిళ్, కన్నడ హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు.